బిజినెస్

పోర్టులపై రూ. 7 వేల కోట్ల పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైగద్ (మహారాష్ట్ర), మార్చి 25: పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్.. తమ సంస్థ జెఎస్‌డబ్ల్యు గ్రూప్ రాబోయే మూడేళ్లకుపైగా కాలంలో దేశ, విదేశాల్లోని పోర్టుల రంగంలో 7,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను పెట్టనుందని శనివారం చెప్పారు. ఇప్పటికే 2,000 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టామన్నారు. అలాగే జెఎస్‌డబ్ల్యు గ్రూప్‌లోని పోర్టుల నిర్వహణ సంస్థ అయిన జెఎస్‌డబ్ల్యు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో 15 శాతం వరకు వాటాను ఉపసంహరించుకోనున్నట్లు కూడా ఆయన తెలిపారు. జెఎస్‌డబ్ల్యు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నేతృత్వంలో రత్నగిరి జిల్లాలోగల ఇక్కడి పోర్టు వద్ద ఆయన విలేఖరులతో మాట్లాడారు. జైగద్ పోర్టు విస్తరణకు 2,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు జిందాల్ ఈ సందర్భంగా వెల్లడించారు.