క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దొరవారిసత్రం, ఏప్రిల్ 6 : దొరవారిసత్రం మండల పరిధిలోని జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎలమంచలి పతాంజలి (62) అనే ప్రముఖ కాంట్రాక్టర్ మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్ తానంకి నానాజీకి మామ అయిన పతాంజలి జీవీఆర్ ఇన్‌ఫ్రాస్టక్చర్‌లో సబ్ కాంట్రాక్టర్‌గా పనులు చేస్తూ సూళ్లూరుపేటలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం బ్యాంకు పని నిమిత్తం గూడూరుకు కారులో బయల్దేరి వెళ్లారు. అనంతరం బ్యాంకు పని ముగించుకొని కారును స్వయంగా నడుపుతూ సూళ్లూరుపేటకు వస్తున్నారు. పోలిరెడ్డిపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన కారును నిలిపి ఉంచడంతో ఈ సమయంలో అదుపుతప్పి అగ్ని ప్రమాదానికి గురై ఉన్న కారును ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో పతాంజలి సంఘటనా స్థలంలో మృతి చెందారు. అయితే కారు డ్రైవర్ మునీంద్రబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన డ్రైవర్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.