క్రైమ్/లీగల్

వేర్వేరు చోట్ల రైలు ఢీకొని ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఏప్రిల్ 6: నగరంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో రైలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. రైల్వే పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నగరంలోని విజయమహల్ రైల్వేగేటు ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తిని రైలు ఢీకొని మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో రైల్వే హెడ్ కానిస్టేబుల్ వరలక్ష్మి సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని చొక్కాపై కాకుపల్లికి చెందిన టైలర్ షాపు ముద్ర ఉండటాన్ని గుర్తించి విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఇదిలావుంటే స్థానిక ఎస్2 థియేటర్ సమీపంలో రైలు ఢీకొని మహిళ మృతి చెందింది. నవాబుపేటకు చెందిన పేట రత్నమ్మ (43) మతి స్థిమితం సరిలేక తిరుగుతూ ఉంటుందని, గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో ఆమె శుక్రవారం మృతి చెందిందని రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం మృతురాలి కుటుంబీకులకు అప్పగించి రైల్వే ఎస్సై వెంకయ్య కేసు దర్యాప్తు చేపట్టారు.