ప్రకాశం

రైస్‌మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందుకూరు, డిసెంబర్ 14: లింగసముద్రం మండలంలోని పెదపవనిలో గల శ్రీలక్ష్మీశ్రీనివాస రైస్‌మిల్లులో గురువారం విజిలెన్స్ సిఐ టిఎక్స్ అజయ్‌కుమార్, బిటి నాయక్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 285 బస్తాలు పాలిష్ బియ్యం, మరో 275 బస్తాలు వరి ధాన్యం గుర్తించినట్లు వారు తెలిపారు. అలాగే లారీలో మరో 200 బస్తాలు బియ్యం, 326 బస్తాలు ఉన్నట్లు గుర్తించారు. పాలిష్ బియ్యాన్ని శాంపిల్స్ తీసుకుని ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు వారు తెలిపారు. ఫలితాల ఆధారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. అంతేకాకుండా విచారణ పూర్తయ్యే వరకు సరుకు నిల్వ ఉంచాలని రైస్‌మిల్లు నిర్వాహకులకు సూచినట్లు వారు తెలిపారు. ఈ దాడుల్లో ఎఫ్‌ఆర్‌ఓ ముక్కంటి బాబు, విజిలెన్స్ సిబ్బంది బి కోటేశ్వరరావు, నరసయ్య, శివకుమార్, విఆర్‌ఓ ఐ గిరి తదితరులు పాల్గొన్నారు.