ప్రకాశం

ప్రత్యేక హోదా కోసం వైకాపా పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, మార్చి 22: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని మొదటి ఉద్యమానికి శ్రీకారం చుట్టింది వైసిపి అధినేత జగన్మోహన్‌రెడ్డి అని మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి అన్నారు. పార్టీ పిలుపుమేరకు గురువారం అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేకహోదా కోసం టిడిపి నాలుగేళ్ళపాటు పోరాడకుండా చివరి దశలో బిజెపితో తెగదెంపులు చేసుకొని డ్రామా ఆడుతోందని అన్నారు. విభజన సమయంలోనే వైఎస్‌ఆర్‌సిపి వ్యతిరేకించిందని, అయితే కాంగ్రెస్‌పార్టీ అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి విభజన చట్టంలో సరైన మార్గదర్శకాలు పెట్టకపోవడం రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అన్నారు. ఈకార్యక్రమంలో వైసిపి రాష్ట్ర మైనార్టీ నాయకులు మీర్జా షంషీర్‌అలీబేగ్,జనసేన నాయకులు సయ్యద్ సాధిక్ , సిపిఐ నేత అందె నాసరయ్య పట్టణ అధ్యక్షులు చిల్లంచర్ల బాలమురళీకృష్ణ, రైతుసంఘం నాయకులు ఉడుముల కోటిరెడ్డి, సపిఎం నాయకులు గాలి వెంకటరామిరెడ్డి, ఎపియుడబ్ల్యుజె నాయకులు ఎన్‌వి రమణ తదితరులు పాల్గొన్నారు.