ప్రకాశం

రైతు సంక్షేమమే టిడిపి లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం టౌన్, ఏప్రిల్ 28: రైతు సంక్షేమమే టిడిపి ధ్యేయమని, అన్నదాతల అభివృద్ధి కోసం ఆర్థిక లోటును తట్టుకొని ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు దక్కిందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల స్థాయి పశు బలప్రదర్శన పోటీలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రైతుల సమస్యలపై ముఖ్యమంత్రికి స్పష్టమైన అవగాహన ఉందని, ఎలాంటి పథకాలు ప్రవేశపెడితే అన్నదాతలు ఆనందపడతారో, లాభదాయకంగా ఉంటుందో అలాంటి పథకాలను రూపకల్పన చేస్తున్నారని అన్నారు. టిడిపి ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా రైతుల కోరిక మేరకు టిడిపి ఆధ్వర్యంలో పశు బలప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నట్లు, ఈఏడాది కూడా ప్రోత్సాహకరంగా టిడిపి ఆధ్వర్యంలో మూడు విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ రాధిక మల్లికార్జున్, గిద్దలూరు టిడిపి ఇన్‌ఛార్జి అన్నా రాంబాబు, దేవస్థాన ట్రస్టుబోర్డు చైర్మన్ యక్కలి కాశీవిశ్వనాథం, మాలపాటి వెంకటరెడ్డి, ఆర్డీఓ చంద్రశేఖరరావు, పాలకవర్గసభ్యులున్నారు.