ప్రకాశం

కేంద్రం చేసిన మోసాలను ప్రజలకు వివరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాళ్ళూరు,ఏప్రిల్ 22:రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాకపోవటంతో జరిగిన అన్యాయాన్ని గ్రామ,గ్రామాన ప్రచారం చేయాలని రాష్ట్ర అటవీశాఖమంత్రి శిద్దా రాఘవరావుతెలిపారు. టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం రామభద్రాపురం, నాగంబోట్లవారిపాలెం, అయ్యలపాలెం, రెడ్డిసాగర్, వెలుగువారిపాలెం గ్రామాల్లో సైకిల్ యాత్రను నిర్వహించారు. వెలుగువారిపాలెం గ్రామంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన హామీలను అమలు పర్చక చేసిన మోసాలను ప్రజలకు వివరించేందుకు సైకిల్ యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ఎన్నికష్టాలు ఉన్నప్పటికికీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారన్నారు. ప్రజలు కూడా నిజానిజాలను గ్రహించి ముఖ్యమంత్రికి మద్దతు తెలపాల్సిన ఆవశ్యకతను వివరించారు. దర్శి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, అభివృద్ధిని చూసి ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలోమండల పార్టీ అధ్యక్ష,కార్యదర్శులు శాగం కొండారెడ్డి, లక్ష్మిరెడ్డి, మాజీ అధ్యక్షుడు షేక్ పెదకాలేషావలి, సొసైటీ అధ్యక్షుడు ఒబులరెడ్డి, జిల్లాసమన్వయకర్త మానం రమేష్, దర్శి నియోజకవర్గ సమన్వయకర్త సాగర్, నాయకులు పిన్నిక రమేష్, యలమందారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, బ్రహ్మారెడ్డి, చందన, గొందిరమణారెడ్డి, సుబ్బారావు, సర్పంచ్‌లు పులి కృష్ణారెడ్డి, నాగేశ్వరరావు,ప్రేమయ్య, జిఎం సుబ్బారెడ్డి, పలుగ్రామాల ఎంపిటిసిలు పాల్గొన్నారు.