ప్రకాశం

పర్యాటక రంగానికి ప్రభుత్వ ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేటపాలెం, ఏప్రిల్ 22: రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు కల్పిస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. మండలంలోని చల్లారెడ్డిపాలెం పంచాయతీ పొట్టి సుబ్బయ్యపాలెం సమీపంలో నిర్మాణంలో ఉన్న సన్‌రైజ్ బీచ్ రిసార్ట్సు అండ్ హాలిడేహోంను ఆయన ఆదివారం సందర్శించి ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాశ్చాత్య దేశాల్లో సముద్ర తీరం వెంట ఉన్న పర్యాటక కేంద్రాలను అధ్యాయనం చేసి వాటి వల్ల వచ్చే ప్రయోజనాలను గుర్తించిన ప్రభుత్వం రిసార్టు నిర్మాణాలను ప్రోత్సహిస్తుందన్నారు. అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ రిసార్టు నిర్మాణంతో ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందడంతోపాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు తేళ్ల సుధీర్, శ్రీధర్, సుబ్బారావు, వీరనారాయణ, తహశీల్దార్ కె ఎల్ మహేశ్వరరావు, చల్లారెడ్డిపాలెం ఉప సర్పంచ్ వై సుబ్రహ్మణ్యం, మాజీ ఎంపీటీసీ కొండూరి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.