ప్రకాశం

విజయవాడ మహానాడుకు భారీగా తరలిన తెలుగుతమ్ముళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, మే 27: విజయవాడలోని సిద్దార్ధ కళాశాలలో జరిగే తెలుగుదేశం పార్టీ మహానాడుకు జిల్లాలోని తెలుగుతమ్ముళ్లు ఆదివారం ఉదయం భారీగా తరలివెళ్లారు. కొంతమంది శనివారం రాత్రి విజయవాడకు వెళ్ళగా, మరికొంతరు ఆదివారం ఉదయం మహానాడులో పాలుపంచుకున్నారు. మహానాడుకు తరలివెళ్లిన వారిలో అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు, ఎమ్మెల్సీలు మాగుంట శ్రీనివాసులరెడ్డి, కరణం బలరామకృష్ణమూర్తి, పోతుల సునీత, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, ముత్తుమల అశోక్‌రెడ్డి, పాలపర్తి డేవిడ్‌రాజు, కదిరి బాబురావు, పోతుల రామారావు, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, ఆమంచి కృష్ణమోహన్, ఏలూరి సాంబశివరావు, ఆయా నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జ్‌లు కందుల నారాయణరెడ్డి, బిఎన్ విజయకుమార్‌తోపాటు పలువురు నాయకులు ఉన్నారు. కాగా టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సారథ్యంలో మాగుంట దండు భారీగా మహానాడుకు తరలివెళ్లింది. జిల్లా నలుమూలల నుంచి ఆయన అభిమానులు భారీగా మహానాడుకు తరలివెళ్లి ఆయనకు సంఘీభావం ప్రకటించారు. మహానాడులో జిల్లాలోని తెలుగుతమ్ముళ్లను ఆప్యాయంగా పలకరిస్తూ మాగుంట శ్రీనివాసులరెడ్డి ముందుకు సాగారు. జిల్లాలోని తెలుగుతమ్ముళ్లు అందరూ విజయవాడకు తరలివెళ్లటంతో పార్టీ కార్యాలయాలు తెలుగుతమ్ముళ్ల సందడి లేక వెలవెలబోతున్నాయి.