క్రైమ్/లీగల్

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శి, జూన్ 14 : ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసిన ఘటన గురువారం తెల్లవారు జామున దర్శి పట్టణంలోని జెండా చెట్టు వీధిలో చోటు చేసుకుంది. జెండా చెట్టువీధిలో నివాసం ఉంటున్న పానెం ఖాశీంవలిని తన భార్య ఖాశీంబి , ప్రియుడు రమణయ్యతో కలిసి గురువారం తెల్లవారు జామున నైలాన్ వైరుతో గొంతు బిగించి హత్య చేశారు. చుట్టుపక్కల వారిని నమ్మించేందుకు భార్య కాశీంబి తన భర్తను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు చంపి ఇంట్లో బంగారం దొంగలించినట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. రంజాన్ పర్వదినం సందర్భంగా రాత్రి ఆ ప్రాంతంలో వేడుకలు నిర్వహించుకుంటున్న కొందరు యువకులు కాశీంవలి ఇంటికి రమణయ్య అనే వ్యక్తి రాత్రి వచ్చి వెళ్లడాన్ని చూడటంతో భార్య చెప్పిన కట్టు కథలు నమ్మకుండా ప్రియుడు రమణయ్య, భార్య ఇద్దరూ కలిసి ఈ హత్యకు పాల్పడి ఉంటారని గట్టిగా నమ్మి యువకులు హతుడు భార్య పై వాదనకు దిగారు. మృతుని అక్క ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న దర్శి సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ సుబ్రమణ్యం హతుడు భార్య కాశీంబిని, ప్రియుడు రమణయ్యలను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయాన్ని ఒప్పుకున్నారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.