క్రైమ్/లీగల్

వైద్యం కోసం వెళ్తూ తిరిగిరాని లోకాలకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, జూన్ 28 : ఆరోగ్యం బాగోలేదని వైద్యం చేయించుకొని కొన్నాళ్లపాటు ప్రశాంతంగా జీవిద్దామనే అభిప్రాయంతో బెంగళూరుకు వెళ్తూ మార్గం మధ్యలో జరిగిన రోడ్డుప్రమాదంలో బేస్తవారపేటకు చెందిన భార్యభర్తలు మృతి చెందగా వారి కుమారుడికి తీవ్ర గాయాలైన సంఘటన గురువారం తెల్లవారుఝామున జరిగింది. సేకరించిన వివరాల మేరకు, బేస్తవారపేటకు చెందిన సుంకేల మస్తాన్‌రావు (60), భాగ్యలక్ష్మి (55) వైద్యం కోసం బెంగళూరుకు కారులో బయలుదేరారు. అయితే కడప జిల్లా చెన్నూరు సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో భార్యభర్తలు మృతి చెందగా, కుమారుడు సుంకుల లక్ష్మీవెంకటప్రసాద్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంకటప్రసాద్ ఓ టివి ఛానెల్‌లో రిపోర్టర్‌గా పని చేస్తున్నారు. కాగా ఈప్రమాదంలో డ్రైవర్ బాలరాజుకు ఎలాంటి గాయాలు కాలేదు. సుంకుల మస్తాన్‌రావుకు గుండెపోటు రావడంతో గతంలో ఆపరేషన్ చేశారు. అయితే తిరిగి వైద్యపరీక్షల నిమిత్తం బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా మస్తాన్‌రావు చిన్న కుమారుడు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండటంతో అక్కడ వైద్యం చేయించుకునేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మస్తాన్‌రావు దీర్ఘకాలంగా కంభం, బేస్తవారపేట ప్రాంతాల్లో రైతులకు అవసరమైన విద్యుత్ మోటార్లు కడుతూ జీవనం సాగిస్తుండేవాడు. అందరికీ పరిచయస్తుడు కావడంతో ఒక్కసారిగా ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. కడప రిమ్స్ కళాశాలలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు.