ప్రకాశం

టీడీపీ నక్కజిత్తులను చిత్తు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,జూలై 17:రానున్న ఎన్నికల్లో అధికార టీడీపీ అనేక నక్కజిత్తులకు పాల్పడుతుందని అందువలన నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు వాటిని తిప్పికొట్టాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం నగరంలోని 38, 43, 44,45 డివిజన్ల పరిధిలోని బూత్ కన్వీనర్లు, సభ్యులతో కర్నూలురోడ్డులోని మహాలక్ష్మి ఫంక్షన్‌హాలులో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి ఓటరు జాబితాలను సరిచూడాలని సూచించారు. అర్హులైన కొత్త ఓటర్లను చేర్పించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషిచేయాలన్నారు. నాలుగేళ్ల నుండి టీడీపీ ప్రభుత్వం సాగించిన అరాచకాలను మరో ఏడాదిలో చెక్ పెట్టేందుకు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం అన్న క్యాంటీన్లు, అందరికీ ఇళ్లంటూ ఊదరగొడుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు పేదప్రజలు కనపడలేదా అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో తాను కొంత నిర్లక్ష్యం చేసినందువల్లే ఓటమిని చవిచూడాల్సి వచ్చిందన్నారు. ఇకపై కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజల సమస్యల పరిష్కారం కోసం కలిసి పోరాడదామన్నారు. ఈ సమావేశంలో పార్టీనగర అధ్యక్షులు శింగరాజు వెంకట్రావు, వైకాపా నాయకులు ఆకుల మోహన్‌రావు, కెద రమణయాదవ్, గోపిరెడ్డి గోపాల్‌రెడ్డి, పి రవీంద్రనాధ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.