ప్రకాశం

రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్చూరు, మే 16: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా అవసరమని మాజీ మంత్రి పనబాకలక్ష్మి అన్నారు. నాలుగు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పాస్టర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు డి జయరావు కుటుంబ సభ్యులను ఆమె సోమవారం పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజనలో అన్ని పార్టీల పాత్ర ఉందని కానీ కాంగ్రెస్ పార్టీ ఒక్కదాన్ని నిందిస్తున్నట్లు ఆమె విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన అంశంలో ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని గుర్తు చేశారు. అప్పట్లో ఉన్న ప్రతిపక్షం కూడా మద్దతు తెలిపి గెలిచిన తరువాత మాట మార్చిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని దీనివల్ల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ప్యాకేజిల వల్ల ఉపయోగం లేదన్నారు. రాష్ట్ర మంత్రులు, బిజెపి మంత్రులు ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు. బాబు వస్తే జాబు వస్తుందన్నారు. కానీ ఇప్పటి వరకు ఉద్యోగాల భర్తీ కాలేదని, ఉద్యోగులు విసిగి వేసారిపోతున్నారన్నారన్నారు. తమ పార్టీ కరువు మండలాలను పట్టించుకుంటుందని తెలిపారు. ఈ నెల 23న ప్రకాశం బ్యారేజి వద్ద రైతులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హాయాంలో నామినేటెడ్ పదవులు ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. ఆమె వెంట ఎం కృష్ణారెడ్డి, ఎల్ శివ, కె సురేంద్ర, వి అబ్రహాం, సువార్తమ్మ, కె మార్కు, హరిబాబు తదితరులున్నారు.