ప్రకాశం

వైకాపాతోనే బీసీల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, ఫిబ్రవరి 18: వైకాపా అధికారంలోకి వస్తేనే బిసిలకు న్యాయం జరగడంతోపాటు, పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి అన్నారు. ఈనెల 17న ఎలూరులో జరిగిన బిసి డిక్లరేషన్ సభ విజయవంతాన్ని పురస్కరించుకుని స్ధానిక గడియారం స్తంభం వద్ద ఉన్న మాజీ ముఖ్యముంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి సోమవారం సాయంత్రం పాలాభిషేకం నిర్వహించారు. ఈసందర్భంగా జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ వైకాపా అదికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయితే బిసిలకు వెంటనే సబ్‌ప్లాన్ అమలు చేస్తారని అన్నారు. అంతేకాక 139 బిసి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. బిసిల అభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయించి వారి అభ్యున్నతికి జగన్ కృషి చేస్తారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీలంతా ఏకమై వైకాపా అధికారంలోకి వచ్చేందుకు సహకరించాలన్నారు. ఈకార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు షంషీర్ అలిబేగ్, చిర్లంచెర్ల కృష్ణ, నల్లబోతుల కొండయ్య, కాశయ్య, శివారెడ్డి, పద్మా తదితరులు పాల్గొన్నారు.