ప్రకాశం

ప్రజాసంక్షేమమే చంద్రబాబు ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామూరు, ఫిబ్రవరి 18: ప్రజాసంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని, ప్రతి కార్యకర్త రానున్న ఎన్నికల్లో సైనికుల్లా పనిచేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు కోరారు. సోమవారం డివి పార్కులో నూతనంగా నిర్మిస్తున్న అన్నా క్యాంటీన్ భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల అభ్యున్నతే ధ్యేయంగా శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిపాలన రాష్ట్రానికి ఎంతైనా అవసరం అన్నారు. లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ దేశం గర్వించే విధంగా అమరావతిని అభివృద్ధి చేస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని ప్రతి గ్రామంలో రూ.4వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పామూరు మండల అడాప్టర్ కదిరి పార్థసారధి, ఎంపిపి ఆవుల నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు పువ్వాడి వెంకటేశ్వర్లు, వైస్ ఎంపిపి పి రాంబాబు, మాజీ సర్పంచులు డివి మనోహర్‌ప్రసాద్, కావిటి సుబ్బయ్య, ఎస్సీసెల్ అధ్యక్షులు మార్కు, మోషే, ఏ ప్రభాకర్‌చౌదరి, పట్టణ అధ్యక్షులు వీరభోగయాచారి, ఖాజరహంతుల్లా, సాంబయ్య, గంగరాజు, నాయబా, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.