ప్రకాశం

ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయండి:కందుల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొదిలి/మార్కాపురం జనవరి 2 : ఈ నెల 4న మార్కాపురంలో జరిగే జన్మభూమి కార్యక్రమంలో పాల్గొననన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన విజయవంతం అయ్యేలా పార్టీ శ్రేణులు గట్టి కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కోరారు. శనివారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిధి గృహంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి మండల దేశంపార్టీ కన్వీనర్ వై వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతంలో ముఖ్యమంత్రి పర్యటించడం ఎంతో అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో దేశం పార్టీ నాయకులు కాటూరి వెంకట నారాయణబాబు, ఎస్ జిలానీ బాషా, సర్పంచ్ జి దీప, ఎంపిటిసీలు నరసింహం, నాయకులు శ్రావణి వెంకటేశ్వర్లు, ఎస్‌ఎం బాషా, షబ్బీర్ , తదితరులు పాల్గొన్నారు. కాగా మార్కాపురం మండలంలోని రాయవరం ప్రాంతంలో పర్యటిస్తున్న దృష్ట్యా కార్యకర్తలు, నాయకులు, టిడిపి అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని టిడిపి ఇన్‌చార్జి కందుల నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ సిఎం పర్యటనను జయప్రదం చేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని అన్నారు.