ప్రకాశం

ఉత్సాహంగా గడప గడపకు వైకాపా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,జూలై 22: ఒంగోలు నగరం 17వ డివిజన్‌లోని ప్రగతీకాలనీ, అంబేద్కర్‌కాలనీల్లో శుక్రవారం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన గడపగడపకు వైఎస్‌ఆర్ పార్టీ కార్యక్రమం ఉత్సాహం సాగింది. బాలినేనికి ఆయాకాలనీల ప్రజలు ముందుగా ఘనస్వాగతం పలికారు. ఈసందర్భంగా బాలినేని ఆయాకాలనీల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్లస్థల సమస్యలతోపాటు, శ్మశాన స్థలాల సమస్యలు, వృద్ధాప్య, వితంతు పెన్షన్లు తదితర సమస్యలను బాలినేని దృష్టికి అక్కడి ప్రజలు తీసుకొచ్చారు. అదే విధంగా కాలనీల్లో అన్ని వౌలిక సదుపాయాలకు సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాల్సిన ప్రభుత్వ అధికారులు పట్టించుకోవటం లేదని బాలినేని దృష్టికి తీసుకువచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని రానున్న కార్పొరేషన్, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులకు ఓట్లువేసి గెలిపించాలని కోరారు.ముఖ్యంగాప్రభుత్వం ఇచ్చిన హామీలను నేరవెర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని ఆయన విమర్శించారు. ఈకార్యక్రమంలో వైకాపా జిల్లానాయకులు వేమూరి సూర్యనారాయణ, కెవి రమణారెడ్డి, వై వెంకటేశ్వరరావు, డిక్రాంతికుమార్,కఠారి శంకర్, ఒంగోలు నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, నాయకులు తోటపల్లి సోమశేఖర్, అంజయ్య, మహిళా నాయకులు గంగాడ సుజాత, బడుగు ఇందిర, కావూరి సుశీల తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ప్రగతీకాలనీ చర్చిలో అక్కడి క్రైస్తవ సోదరుల కోరిక మేరకు బాలినేనిలో ప్రార్థనల్లో పాల్గొన్నారు.