ప్రకాశం

32వేల కొత్త రేషన్‌కార్డులు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందుకూరు, జనవరి 3: జిల్లా వ్యాప్తంగా 32వేల కొత్త రేషన్‌కార్డులు మంజూరు అయినట్లు జిల్లా జెసి హరిజవహర్‌లాల్ వెల్లడించారు. మంగళవారం పట్టణంలోని 6వ వార్డులో జరిగిన జన్మభూమి - మాఊరు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 32వేల నూతనంగా మంజూరైన రేషన్‌కార్డులకు కూడా త్వరలో సరుకులు ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లాలో 75వేల సర్వే నెంబర్లు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదని, అందువలన భూ సమస్యలను పరిష్కారం కావడం లేదని, దానికి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో 8.71లక్షల కార్డుదారులకు 30శాతం మంది కార్డుదారులకు చంద్రన్న సరుకులు అందజేసామన్నారు. ఆర్డీఓ జి మల్లికార్జున మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికే జన్మభూమి - మాఊరు ముఖ్య లక్ష్యమని చెప్పారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేయాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే పోతుల రామారావు మాట్లాడుతూ కందుకూరు అభివృద్ధికి రూ.48కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని, అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు పూర్తి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం వృద్ధులకు, వికలాంగులకు పింఛన్ల పంపిణీ, రేషన్‌కార్డుదారులకు చంద్రన్న సంక్రాంతి సరుకులను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, ఆదెన్న, ఎఎంసి చైర్మన్ తల్లపనేని వెంకటేశ్వర్లు, జడ్‌పిటిసి కంచర్ల శ్రీకాంత్, ఏరియా వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ పి వెంకటేశ్వర్లు, జన్మభూమి కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.