ప్రకాశం

కనిగిరి మదర్సా హెచ్‌ఎం అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కనిగిరి రూరల్, జనవరి 22: కనిగిరి మదర్సా హెచ్‌ఎం రషీదాను ఆదివారం అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు ఎస్‌ఐ యు శ్రీనివాసులు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మదర్సాలో హెచ్‌ఎం రషీదా విద్యార్థినుల పట్ల కిరాతంగా వ్యవహరించి వారికి వాతలు పెట్టడం, కళ్లలో వెల్లుల్లి రసం వేసి తీవ్రంగా హింసించినట్లు ఆరోపణలు రావడంతో రషీదాపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి కందుకూరు కోర్టుకు తరలించినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి నలుగురిపై కేసులు నమోదు చేసామని, మిగిలిన ముగ్గురిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని ఆయన అన్నారు.
మదర్సాపై అధికారుల విచారణ
మదర్సాలో విద్యార్థినులపై జరిగిన హింసాత్మక ఘటన కేసులపై ఆదివారం ఆర్‌డిఓ మల్లికార్జున, ఐసిడిఎస్ పిడి విశాలక్ష్మి, మైనారిటి సంక్షేమశాఖ ఇడి కరిముల్లా విచారణ చేపట్టారు. మదర్సాకు వెళ్లి వివిధ రికార్డులను పరిశీలించారు. కేసు విచారణలో భాగంగా రషీదాను ఘటన వివరాలను అడిగి నమోదు చేసుకున్నారు. అనంతరం ఆర్‌డిఓ మల్లికార్జున విలేఖర్లతో మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటుచేయగా అందుకు సంబంధించి విచారణ చేపట్టామని తెలిపారు. రషీదాతోపాటు బాధిత చిన్నారులను కలసి వివరాలను నమోదు చేసుకొని ఉన్నతాధికారులకు అందచేస్తామని ఆయన పేర్కొన్నారు.