ప్రకాశం

పెండింగ్ కేసులపై ఎస్పీ సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఫిబ్రవరి 28: కందుకూరు సబ్‌డివిజన్ పోలీసు అధికారులతో ఎస్‌పి త్రివిక్రమవర్మ మంగళవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా యుఐ గ్రేవ్ కేసులు, ప్రాపర్టీ కేసులు, ఎస్‌సి, ఎస్‌టి కేసులుకు సంబంధించి అందరినీ పిలిపించి ఎస్‌పి క్షుణంగా అడిగి తెలుసుకున్నారు. కేసులన్నీ పెండింగ్‌లో లేకుండా విచారణ పూర్తి చేయాలని కందుకూరు సబ్‌డివిజన్ సిఐలకు , ఎస్‌ఐలకు సూచించారు. మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదులు వెంటనే విచారణ పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిఆర్‌బి డిఎస్‌పి బి మరియదాసు, కందుకూరు డిఎస్‌పి కె ప్రకాశ్‌రావు, కందుకూరు సిఐ నరసింహారావు, కనిగిరి సిఐ సుబ్బారావు, పామూరు సిఐ రాజేష్ కుమార్, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.