ప్రకాశం

తెలుగు రాష్ట్రాల్లో 2019 నాటికి అతిపెద్దపార్టీగా బిజెపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, మార్చి 21 : తెలుగు రాష్ట్రాల్లో 2019 నాటికి అతి పెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ బలమైన క్రియాశీలకంగా ఎదగనున్నట్లు జాతీయ మహిళా మోర్చ ఇన్‌చార్జి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి వెల్లడించారు. మంగళవారం గోపి థియేటర్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో తమ పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతుందని 2019 ఎన్నికల నాటికి అధికారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో బిజెపి పాత్ర ఎనలేనిదన్నారు. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం తెలంగాణాలోని ఏడు మండలాలను రాష్ట్రంలో కలిపిందని గుర్తు చేశారు. రాష్ట్రానికి పోలవరం జీవధార లాంటిదని అలాంటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి వంద శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మాణ బాధ్యతలు అప్పగించిందన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును ట్రాన్స్ టాయ్ కంపెనీ నిర్మాణం చేపట్టిందని, అతి త్వరగా ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో కృషి చేస్తున్నా నిర్మాణాలు ఆలస్యం కావడంతో ముఖ్యమంత్రి కూడా అసహనం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. రాష్ట్భ్రావృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ప్యాకేజీకి చట్ట్భద్రత కల్పించారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం అంకిత భావంతో పని చేస్తుందన్నారు. ఇప్పటికే రెండు లక్షల 40 వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి నిధులు సమకూర్చడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం జనవరి 1వ తేది నుండి 9 లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరికీ వడ్డీలో నాలుగు శాతం , 12 లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరికీ వడ్డీలో మూడు శాతం కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తున్నట్లు గుర్తు చేశారు. నల్లధనాన్ని తిరిగి రాబట్టేందుకు పెద్దనోట్లను రద్దు చేయడం జరిగిందన్నారు. దీనిని భారతదేశంలోని 125 కోట్ల మంది ప్రజలు స్వాగతిస్తే ప్రతిపక్ష పార్టీలు మాత్రం వ్యతిరేకించాయన్నారు. ఆయా పార్టీలు వ్యతిరేకించినప్పటికీ ఉత్తర భారతదేశంలోని నాలుగు ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బిజెపి భారీ మోజార్టీతో గెలుపొందిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారతదేశంలో అతి పెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్‌లో మంచి మెజార్టీ సాధించడం వలన బిజెపి శ్రేణుల్లో మరింత ఉత్సాహం వచ్చిందన్నారు. కేవలం సుస్థిర పాలన, అవినీతి రహిత పాలన అందించడమే మోదీ ధ్యేయమన్నారు. ఆనాడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి వెనుకబడిన వర్గాల వారికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, అదే స్పూర్తితో బిజెపి కూడా మోదీకి ప్రాధాన్యత కల్పించారని గుర్తు చేశారు. బూత్ లెవల్ నుండి రాష్టస్థ్రాయి వరకు పార్టీని బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఓబిసి సెల్ రాష్ట్ర అధ్యక్షులు మధుసూదన్, నాయకులు ఖలీఫ్‌తుల్లా బాషా, వి సురేష్, ఎస్ శ్రీనివాసరావు, ఎం బాబూరావు, గోలి నాగేశ్వరరావు, ఎం శ్రీనివాసరావులతో పాటు బిసి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.