ప్రకాశం

రోడ్డు ప్రమాదంలో ఎంపిటిసి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అద్దంకి, మే 1: హైదరాబాదులో ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్ చూసి ఇంటికి వస్తున్న అద్దంకి మండలం శింగరకొండపాలెం ఎంపిటిసి చావలి శ్రీకాంత్(35) సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. శింగరకొండపాలెం గ్రామానికి చెందిన ఎంపిటిసి శ్రీకాంత్ ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్షంగా వీక్షించేందుకు తమ స్నేహితులతో కలసి హైదరాబాదు వెళ్ళాడు. మ్యాచ్ అయిపోయిన అనంతరం స్నేహితులతో కలసి కారులో వస్తుండగా గుంటూరు జిల్లా సూర్యారావు పేట సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతి చెందిన ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు అద్దంకి మండల వాసి శ్రీకాంత్‌గా గుర్తించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని అద్దంకి మండలం శింగరకొండపాలెంకు తరలించనున్నారు.