క్రైమ్/లీగల్

మహిళ దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దదోర్నాల, ఏప్రిల్ 6: మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన మండలంలోని అయినముక్కుల గ్రామ పొలాల్లో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు అయినముక్కుల గ్రామం దాసరికాలనీకి చెందిన బి రాములమ్మ (40) హత్యకు గురైంది. గ్రామస్తులు శుక్రవారం పొలం పనులకు వెళ్తుండగా రాములమ్మ మృతదేహం పత్తిపొలంలో కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఈమేరకు ఎస్సై రామకోటయ్య సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాములమ్మను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని, నిందితులను త్వరలో పట్టుకుంటామని, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

భర్త వేధింపులు తట్టుకోలేక
భార్య, కుమార్తె ఆత్మహత్య
త్రిపురాంతకం, ఏప్రిల్ 6: భర్త వేధింపులు తాళలేక భార్య, కుమార్తె ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని మేడపి గ్రామంలో గురువారం జరిగింది. పోలీసుల కథనం మేరకు మేడపి గ్రామానికి చెందిన మాబు తరచూ మద్యం సేవించి భార్య నాసర్‌బీ (32), కుమార్తె సాఫియా (12)ను వేధిస్తుండటంతో గురువారం సాయంత్రం 4గంటలకు తల్లీ, కుమార్తె కలిసి మేడపి గ్రామంలో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే నాసర్‌బీది పెద్దదోర్నాల గ్రామం కావడంతో ఇటీవల ఆమెకు ఆరోగ్యం సక్రమంగా లేకపోవడంతో పెద్దదోర్నాలలో ఉండి వారంరోజుల కిందట అత్తగారింటికి మేడపి గ్రామానికి వచ్చారు. తల్లిదండ్రుల వద్దనే ఉండి వైద్యం చేయించుకోవాలని, నా వద్ద డబ్బులు లేవని భర్త మాబు తరచూ మద్యం సేవించి వేధిస్తుంటాడని, అందువలనే ఆత్మహత్యకు పాల్పడ్డారని బంధువులు తెలిపారు. మాబు తన బంధువుల వద్దకువెళ్ళి వైద్యం కోసం డబ్బులు తీసుకువచ్చే సరికి తల్లీకూతురు ఇంటి వద్ద లేకపోవడంతో ఇరుగుపొరుగును విచారించగా డబ్బాపట్టుకొని వెళ్ళారని తెలిపారు. అయితే రాత్రి మొత్తం వెతికారని, శుక్రవారం తెల్లవారుజామున 7గంటలకు మేడపి గ్రామంపక్కన పాతబడిన బావి వద్ద చెప్పులు దొరకడంతో బంధువులు అక్కడికి వెళ్లి చూడగా బావిలో తల్లి నాసర్‌బీ, కూతురు సాఫియా మృతదేహాలు ఉన్నట్లు గుర్తించి బయటకు తీశారు. భర్త మాబును అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఎస్సై కమలాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.