తెలంగాణ

ప్రణయ్ విగ్రహ ఏర్పాటుపై నిరసనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ విగ్రహ ఏర్పాటుపై నిరసనలు వెల్లువెత్తాయి. మిర్యాలగూడలోని తల్లిదండ్రుల సంఘం ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు కర్నాట ప్రభాకర్, న్యాయవాది చిలుకూరి శ్యామ్ మాట్లాడుతూ ఇది కుటుంబ సమస్య అని దీనిని కుల, మతాల సమస్యగా మార్చి సమాజంలోని అందరికీ ఆపాదించటం సమంజసం కాదని అన్నారు. ప్రణయ్ విగ్రహాన్ని వారి సొంత స్థలంలో ఏర్పాటుచేసుకోవాలని, నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేస్తే సమాజానికి చెడు సందేశం వెళుతుందని అన్నారు. దీనిపై డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని అన్నారు.