ప్రార్థన

నిత్యుడగు తండ్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలయనగా మనకు శిశువు పుట్టెను. మనకు కుమారుడనుగ్రహించబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.
ఎంతటి ఆశ్చర్యమంటే ‘ఆది అంతము లేనివాడు నిన్న నేడు ఏక రీతిగా ఉన్నవాడు ఆయన ఆలోచనలు భూమి కంటె ఆకాశము ఎంత ఉన్నతమో అంత ఉన్నతమైన ఆలోచనలు గలవాడు. తన మహాబలముతో మన పాపాలన్నిటిని సిలువ మీద మోసిన నిత్యుడగు తండ్రి. హళ జఒ ఆ్దళ ఒ్యఖూషళ యచి ఉఆళూశజఆక. మనలను కూడ నిత్యత్వానికి నడిపిస్తాడు. నిత్యము దేవాది దేవునితో ఉండే భాగ్యము కలుగజేస్తాడు. ఎల్లకాలము అంటే యుగయుగములు తరతరములు ఉండే భాగ్యము అనుగ్రహిస్తాడు.
దేవుడు మనకు నిత్యజీవము అనుగ్రహించెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. పునరుత్థానము జీవము యేసే. ఆయనే మార్గము సత్యము జీవము. ఈయన ద్వారానే నిత్యత్వములోనికి తండ్రి యొద్దకు చేరగలము. నిత్య రాజ్యములో సదాకాలము ఉండగలము.
ఈ లోకము దాని ఆశలు గతించిపోవును. మన కన్నులకు కనిపించే ఈ అందమైన ప్రకృతి, అంతరిక్షము అన్నీ గతించిపోయేవే. అల్పమైన ఈ లోకాన్ని ప్రేమించి అనంతమైన ప్రభువుకు దూరంగా ఉంటూ, అసలు సృష్టికర్తనే మరచిపోయేటట్టు చేశాడు సాతానుడు. సాతానుని మోసాలలో కుయుక్తిలో మాయలో పడి ఈ జీవితకాలము సంతోషంగా ఉంటే చాలు. తరువాత ఏమైతే ఏం అన్న ధోరణిలో ఉన్నారు మనుషులు. ఈ దినం సంతోషంగా ఉంటే చాలు, ఈ గంట సంతోషంగా ఉంటే చాలు అనేట్టు మానవుని మభ్యపెట్టాడు సాతానుడు. మంచి మంచి ఎరలతో ఉరులు వేస్తుంటాడు జాగ్రత్త.
చదువులు మంచిగా చదివి తల్లిదండ్రులను సంతోషపెట్టుచు మంచి ఉద్యోగాలలో స్థిరపడితే జీవితాంతము సుఖ సంతోషాలతో ఎటువంటి కొదువ లేకుండా ఉండవచ్చు. కానీ కాలేజీ చదువుకునే సమయంలో ఎంజాయ్‌మెంట్ అని క్లాసులు ఎగ్గొట్టి ఆ రోజు సంతోషంగా ఉంటే చాలు అనుకుంటారు. చాలీచాలని మార్కులతో చాలీచాలని జీతాలతో జీవితాంతం బాధపడుతూ వుంటారు. అలాంటిదే ఈ జీవితం క్షణభంగురం. ఆవిరి వంటిది ఇంతలో కనపడి అంతలో మాయమై పోతుంది. నిన్న చక్కగానే ఉంటారు. ఈ రోజు ఏవౌతారో తెలియదు. రేపు ఉంటారో లేదో తెలియదు. ఈ జీవితానికి గ్యారంటీ లేదు. ఈ గ్యారంటీ లేని జీవితం గడ్డిపువ్వు లాంటి జీవితం. ఎంజాయ్ చెయ్యి. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అనుకునే స్థితి లోనికి సాతానుడు మానవుని భ్రమింపచేశాడు. మానవుని కళ్లకు గంతలు కట్టి దేవుని రాజ్యాన్ని ఆయన మహిమను ఆయన ద్వారా మనము పొందబోయే మహిమను చూడనివ్వటము లేదు. నిత్యత్వములోనికి ప్రవేశించకుండ ఈ లోక అందాలతో అల్పకాల సుఖ భోగాలతో సంతోషాలతో హోదాలతో పరువు ప్రతిష్ఠలతో అల్లరితో కూడిన ఆటపాటలతో త్రాగుడు జూదం వ్యభిచారం లాంటి అనేక విషయాలతో ముడివేశాడు. నిజ జీవితాన్ని తెలుసుకోకుండా జీవాధిపతిని తెలుసుకోకుండా నిత్యత్వాన్ని చేరుకోకుండా సాతానుడు అనేక రకాలుగా మోసపరుస్తున్నాడు.
దేవుని ప్రణాళిక మానవుని పట్ల ఎంతో గొప్పది. ఆయన తన స్వహస్తాల తో ఆయన రూపులో మనలను చేసి నిత్యము ఆయనతోనే ఉండాలని, సహవాసము చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. ఈ గొప్ప కార్యాన్ని గ్రహించకుండా సాతానుడు మనిషిని అంధకారంలో ఉంచాడు. మానవుని కళ్లకు గంతలు కట్టి దేవుని మహిమను దేవుని రాజ్యాన్ని ఆయన ద్వారా మనము పొందబోయే మహిమను చూడనివ్వటం లేదు. ఆయన నిజమైన ప్రేమను పొందనీయటం లేదు.
ఇటువంటి అంధకార స్థితిలో ఉన్న మనము సత్యవంతుడైన దానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు మనకు వివేకమనుగ్రహించి మన మనోనేత్రాలను వెలిగించటానికి ఒక సామాన్య మానవునిగా, శిశువుగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్వరూపియై యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము సాతానుడు అవిశ్వాసులైన వారికి గ్రుడ్డితనము కలుగజేశాడు.
అంధకారము లో అలమటిస్తున్న ప్రజలను ఎంతో ప్రేమించి దేవుడు తన ఏకైక కుమారుని, జీవమై యున్న క్రీస్తును, నిత్యుడగు తండ్రిని ఈ లోకానికి పంపాడు. ఆయన యందు విశ్వాసముంచు వారు నశింపక నిత్యజీవము పొందుకునే టట్లు చేశాడు. యేసుని యందు విశ్వాసముంచు వారు నశింపక నిత్య జీవము పొందుకోవటమే కాదు, వారి కడుపులో నుండి జీవజల నదులు పారును గనుక అనేకులను నిత్య జీవానికి వారసులుగా చేయగలుగుదురు. ఈయన నిత్యుడు గనుక మనలను కూడ నిత్యత్వము లోనికి నడిపిస్తాడు. పాపులు పరిశుద్ధుని చేరలేరు కనుక కుమారుడైన యేసు గాయపరచబడి ఆయన శరీరమనే తెర ద్వారా మనకు నిత్యత్వము లోనికి మార్గము కలుగజేశాడు. ప్రభువు నిత్యుడు గనుక ఆయనను వెంబడించే వారు నిత్య రాజ్యానికి వారసులౌతారు.
తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమిచ్చును. - యోహాను 1:12.
ఆయనను రక్షకుడని నమ్ముట ఆయన మాటలు పాటించటం ఆయనను ప్రేమించటము ద్వారా నిత్యత్వములోనికి ప్రవేశిస్తాము. యేసుక్రీస్తు నందు విశ్వాసముంచువాడు జీవము గలవాడు. ఆయనను వెంబడించిన వారికి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానని ప్రభువు వాగ్దానం చేశాడు.
ఈయన అన్నింటికంటె ముందుగా ఉన్నవాడును సమస్తమునకు ఆధారభూతుడునై యున్నాడు. ఈయన సిలువలో మన కొరకు మరణించి పునరుత్థానుడై మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగివేయును. ఆయనను నమ్మిన యెడల ఈ క్షయమైన శరీరము అక్షయతను ధరించుకొనును. జీవ గ్రంథములో మన పేర్లు వ్రాయబడి యుండును.
ఈయనను నమ్మక, ఆయన మాటలను నిర్లక్ష్యము చేసినవాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలచి యుండును.
సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవము అనుగ్రహించును. ఆ నిత్యత్వములో శాపము లేదు దుఃఖము లేదు ఏడ్పు లేదు రాత్రి ఉండదు. ఆ నిత్యత్వములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగు నందు సంచరింతురు. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు.
ప్రభువు వర్తమాన భూత భవిష్కత్కాలములలో ఉన్నవాడు. అల్ఫయు ఓమెగాయును అయినవాడు. ఆది అంతమై యున్నవాడు. ఆయనే జీవము ఆ జీవము ప్రత్యక్షమాయెను. తండ్రి యొద్ద నుండి ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును రెండు వేల సంవత్సరముల క్రితము ప్రభువు శిష్యులు కన్నులారా చూశారు. తాకి చూశారు. నిదానించి కనుగొన్నారు. తిరిగి మనకందరికి తెలియజేశారు.
నిత్యుడగు తండ్రి యందు విశ్వాసముంచి ఆయన ఆజ్ఞానుసారంగా జీవించి నిత్య జీవము పొందుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మన కందరికి సహాయము చేయునుగాక.

-మద్దు పీటర్ 9490651256