రాష్ట్రీయం

‘ప్రవాసి ప్రసిద్ధ మహిళ’ అవార్డుకు ఎంపికైన వసుధాగుప్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: దుబాయ్‌లో సంఘ సేవకురాలిగా పని చేస్తున్న భారతీయ మహిళ అరవపల్లి వసుధా గుప్తాకు ‘ప్రవాసి ప్రసిద్ధ మహిళ’ అవార్డు లభించింది. వివిధ రంగాల్లో మహిళల సాధికారిత కోసం అత్యుత్తమ సేవలందించినందుకు గాను ఆర్యవైశ్య అఫీషియల్స్, ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆయా మహిళలకు ‘ఎమినెంట్ వైశ్య ఉమెన్ అవార్డులు’ను అందజేస్తున్నట్లు అసోసియేషన్ తెలిపింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 13న కాచిగూడలోని వైశ్య హాస్టల్‌లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. వసుధా గుప్తా దుబాయ్‌లోని వాసవి యూత్ ఎన్‌ఆర్‌ఐ ఫోరమ్‌లో గత పదేళ్లగా చురుగ్గా పని చేస్తున్నారు.