రాష్ట్రీయం

రాష్టప్రతి క్రిస్మస్ శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 24: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా రాష్టప్రతి ప్రణభ్‌ముఖర్జీ, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, సిఎంలు చంద్రబాబు నాయుడు, కె చంద్రశేఖరరావు క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాలని, జీసస్ చూపించిన కరుణ, ప్రేమ బాటలో నడవాలని రాష్టప్రతి ప్రణభ్‌ముఖర్జీ తన సందేశంలో పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో క్రిస్మస్ జరుపుకోవాలని కోరారు. ‘జీసస్ అంటే ఈ భూమీద నడయాడిన పరమాత్మ స్వరూపమని, మానవులకు మారద్గదర్శనం చేసేందుకు వచ్చిన దైవపుత్రుడని’ చంద్రబాబు కొనియాడారు. తెలంగాణ సిఎం కెసిఆర్ ఒక ప్రకటనలో ప్రజల్లో శాంతి, సౌభ్రాతృత్వం, సేవాతత్పరత పెంచడానికి జీసస్ జీవితమే స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. సర్వమానవ సమానత్వం, సహనం, శాంతి, ప్రేమ, కరుణ వంటి క్రీస్తు బోధనలు మానవాళికి అనుసరణీయమని వైకాపా అధినేత జగన్ పేర్కొన్నారు.