రాష్ట్రీయం

నేడు తిరుపతికి రాష్టప్రతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 24: భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ 25వ తేదీన శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనార్ధం శుక్రవారం నాడు తిరుమలకు వెళ్లనున్నారు. ఈ నెల 25వ తేదీన తూర్పుగోదావరి జిల్లా ఐ భీమవరంలో టిటిడి ఆధ్వర్యంలోని వేద పాఠశాల కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం విజయవాడ నుండి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానంలో మధ్యాహ్నం 1.50 గంటలకు బయలుదేరి తిరుపతి విమానాశ్రయానికి 2.50 గంటలకు చేరుకుంటారు. 3 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుండి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి 3.40 గంటలకు తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. సాయంత్రం 4.25 గంటలకు పద్మావతి అతిథి గృహం నుండి బయలుదేరి 4.30 గంటల నుండి 4.45 గంటల వరకూ వరహాస్వామి వారిని దర్శించుకుంటారు. 4.50 గంటల నుండి 5.35 గంటల వరకూ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. సాయంత్రం 5.35 గంటలకు ఆలయం నుండి బయలుదేరి తిరుమల పద్మావతి అతిథి గృహానికి 5.45 గంటలకు చేరుకుంటారు. 6 గంటలకు తిరుమల నుండి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి తిరుపతి విమానాశ్రయానికి 6.45 గంటలకు చేరుకుంటారు. 6.55 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుండి ఇండియన్ ఎయిర్‌ఫోర్సు విమానం ద్వారా హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తారు.