తెలంగాణ
రేపు కృష్ణా పుష్కరాల ముగింపు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 22 August 2016
హైదరాబాద్,విజయవాడ: కృష్ణా పుష్కరాలు మంగళవారంతో ముగియనున్నందున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లో కృష్ణానదీ తీరాన పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీగా తరలివెళుతున్నారు. ఎపిలో కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లోను, తెలంగాణలో నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలలో పుష్కర ఘాట్ల వద్ద ఆదివారం నుంచి అనూహ్యంగా రద్దీ పెరగడంతో అధికారులు, పోలీసులు మరింత అప్రమత్తంగా ఉంటున్నారు. పుష్కరాల ముగింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. బోట్ల వద్ద ఉంచిన పడవల్లో గజ ఈతగాళ్లను, సహాయక బృందాల సంఖ్యను పెంచారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీని నియంత్రిస్తున్నారు.