క్విజ్

శాంతిదూత వాజపేయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1.లోక్‌సభలో మెజారిటీ లేక మొదటిసారి 13 రోజులు రెండోసారి 13 నెలలకే తన ప్రభుత్వం పడిపోయినా మరొక పార్టీ మద్దతు కోసం, పదవి కోసం వాజ్‌పేయిగారు నైతికతపై రాజీ పడలేదు. నీతి, నిజాయితీ, విలువలు కల్గిన రాజకీయ నాయకుడు వాజ్‌పేయి అనడానికి నిదర్శనమిది. వాజ్‌పేయి పుట్టిన రోజు, డిసెంబర్ 25ని ఏ రోజుగా ప్రకటించారు?
ఎ.సుపరిపాలన దినోత్సవం
బి.నైతికత రాజకీయ దినోత్సవం
సి.శాంతితో కూడిన పాలన దినోత్సవం
డి.రాజకీయ చతురతా దినోత్సవం
2.2015లో భారతీయ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అందుకొన్న అటల్ బిహారీ వాజ్‌పేయి జీవితంలో తొలిసారిగా ఏ పదవి చేపట్టారు?
ఎ.కేంద్ర సహాయ విత్త మంత్రి
బి.మధ్యప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి
సి.ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
డి.కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రి
3.సగర్వంగా ఐక్యరాజ్యసమితి అసెంబ్లీలో హిందీలో ఉపన్యాసమిచ్చి భారతీయ సంస్కృతిని చాటిచెప్పిన వాజ్‌పేయి పరిపూర్ణమైన సానుకూల జాతీయవాది అనడానికి తార్కాణానికి వచ్చిన పురస్కారాలేవి?
ఎ.పద్మ విభూషణ్, భారతరత్న
బి.లోకమాన్య తిలక్ అవార్డు, బంగ్లాదేశ్ విముక్తి యుద్ధ గౌరవం
సి.పండిట్ గోవింద్ వల్లభ పంత్ అవార్డు
డి.పైవన్నియు
4.వాజ్‌పేయికి మూడు పదుల వయస్సులో పార్లమెంటులో అనర్గళంగా మాట్లాడుతూంటే ‘ఈ కుర్రోడు భవిష్యత్తులో ఏదో ఒకరోజు దేశ ప్రధాని అవుతాడు’ అని మెచ్చుకోలుగా జోస్యం చెప్పిందెవరు?
ఎ.లాల్‌బహదూర్ శాస్ర్తీ
బి.పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ
సి.శ్యామాప్రసాద్ ముఖర్జీ
డి.దీన్‌దయాళ్ ఉపాధ్యాయ
5.1980లో వాజ్‌పేయి తొలి అధ్యక్షుడిగా బిజెపి పార్టీని స్థాపించారు. బిజెపి ఆవిర్భావం తరువాత తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో వాజ్‌పేయి ఓడినదెప్పుడు?
ఎ.ఎప్పుడూ ఓటమి చవి చూడలేదు
బి.1991, రాజీవ్‌గాంధీ మరణానంతరం
సి.1983, ఇందిరాగాంధీ మరణానంతరం
డి.1980, సంజయ్‌గాంధీ మరణానంతరం
6.పాకిస్తాన్ కార్గిల్‌లో చొరబడి దురాక్రమణకు పాల్పడినా, కయ్యానికి కాలు దువ్వినా, ఓరిమి వహించి చివరి వరకు పాకిస్తాన్‌తో దౌత్య సంబంధాలను మెరుగుపరచాలని చూసి శాంతి సందేశాన్ని అందించిన మహనీయుడు వాజ్‌పేయి. ఏ సంఘటనలో పాకిస్తాన్ బూటకాన్ని వాజ్‌పేయి బట్టబయలు చేసి ఎండగట్టారు?
ఎ.1999లో లాహోర్ బస్సు యాత్ర అప్పుడు
బి.2001లో ముషారఫ్‌తో ఆగ్రా శిఖర సమావేశంలో
సి.1994లో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి, జెనీవాలో
డి.పైవన్నియు
7.పూర్వ ప్రధానమంత్రి వాజ్‌పేయి నాయకత్వంలో 1998లో అబ్దుల్ కలాం ద్వారా పోఖ్రాన్ 2 అణు పరీక్షలు నిర్వహించాక వాజ్‌పేయిగారు ఏ నినాదం చేశారు?
ఎ.ప్రపంచ దేశాల్లారా మా భారతదేశం అణ్వాయుధ దేశం, జాగ్రత్త
బి.పాకిస్తాన్‌కి ముచ్చెమటలు కారిస్తుందిక మా భారత్
సి.జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్
డి.పాకిస్తాన్ నీ పిలక పీకిస్తాన్
8.క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో నూనూగు మీసాలొచ్చిన వాజ్‌పేయి ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరక ముందు మొట్టమొదట ఏ సిద్ధాంతాన్ని కొన్నాళ్లపాటు ఆలింగనం చేసుకొని మ్రొగ్గు చూపారు?
ఎ.సోషలిజం బి.కమ్యూనిజం
సి.్ఫసిజం డి.మార్క్సిజం
9.అనేక భాషలు మరియు మతాల వైవిధ్యభరితమైన భారతదేశానికి సేవ చేయడానికి పుడమి పై పుట్టిన మేటి నాయకుడు, మంచి వక్త, కవి, చతురత, రాజకీయ పరిజ్ఞానం గల ప్రతిభాశీలి, ఉన్నతమైన వ్యక్తిత్వం కల వాజ్‌పేయి ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరిన తొలి రోజుల్లో ఏ పత్రిక కోసం పని చేసేవారు?
ఎ.స్వదేశ్ బి.పాంచజన్య, వీర్ అర్జున్
సి.రాష్ట్ధ్రార్మ డి.పైవన్నియు
10.శాంతిదూత, అటల్ బిహారీ వాజ్‌పేయి 16 ఆగస్టు 2018 నాడు వైకుంఠ ద్వారాన్ని చేరుకొన్నారు. 2003లో చైనాను సందర్శిస్తూ టిబెట్‌ను చైనాలో భాగంగా అటల్జీ గుర్తించేరు. వాజ్‌పేయి దౌత్యవ్యూహం ఫలితంగా, చైనా భారతదేశం యొక్క ఏ భూభాగాన్ని భారతదేశంలో భాగంగా అంగీకరించింది?
ఎ.సిక్కిం బి.కాశ్మీర్
సి.పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ డి.పైవన్నియు
================================================================
గత వారం క్విజ్ సమాధానాలు
1.సి 2.డి 3.డి 4.సి 5.సి 6.సి 7.డి 8.డి 9.డి 10.సి

-సునీల్ ధవళ సెల్: 97417 47700