ఆంధ్రప్రదేశ్‌

వెంకయ్యతో బహిరంగ చర్చకు రెడీ: రఘువీరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎపికి ప్రత్యేకహోదా హామీని నెరవేర్చడంలో బిజెపి నేతలు విఫలమయ్యారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి శుక్రవారం ఆరోపించారు. ప్రత్యేకహోదాపై మాట మార్చిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఎపికి భారీగా నిధులు ఇస్తున్నట్లు చెప్పడంలో అర్థం లేదన్నారు. హోదా ఇవ్వడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని కూడా బిజెపి నేతలు అనడం దారుణమన్నారు. ఈ విషయమై బహిరంగ చర్చకు తాను సిద్ధమేనని ఆయన వెంకయ్యకు సవాల్ చేశారు. తేదీ, వేదికను వెంకయ్య నిర్ణయిస్తే తాను చర్చకు తప్పకుండా హాజరవుతానన్నారు.