ఆంధ్రప్రదేశ్
రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని రఘువీరా డిమాండ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 3 September 2016
అనంతపురం: వేరుశనగ పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. చిలమత్తూరు మండలం కొడికొండ చెక్పోస్ట్ దగ్గర ఎండిన వేరుశనగ పంటలను శనివారం రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి సూర్యప్రకాశ్రెడ్డి పరిశీలించారు. వర్షాభావం వల్ల వేరుశనగ పంట పూర్తిగా ఎండిపోయిందని, ఇప్పడు రెయిన్గన్లు ఇవ్వడంవల్ల ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించారు. రైతులను విస్మరిస్తే ప్రభుత్వానికి పతనం తప్పదని రఘువీరా హెచ్చరించారు. పుష్కరాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం రైతులను విస్మరించడం సరికాదన్నారు.