జాతీయ వార్తలు

అమ్మకానికి ప్రభుత్వ రంగ సంస్థలు:రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అత్యంత లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ కంటైనర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా సంస్థను అమ్మేందుకు మోదీ ప్రభుత్వం యత్నిస్తుందని కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఈ సంస్థను తన పారిశ్రామిక స్నేహితులకు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. కాంకర్ యూనియన్ సభ్యులు ఈ రోజు రాహుల్ గాంధీని కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యలను రాహుల్‌గాంధీ అడిగి తెలుసుకున్నారు. యూనియన్ సభ్యులు సమర్పించిన పిటిషన్‌ను రాహుల్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలకు కాంకర్ మణిహారం వంటిదని పేర్కొంటూ మోదీ తన పారిశ్రామిక మిత్రులకు కట్టబెట్టేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు.