ఆంధ్రప్రదేశ్‌

రేపు బండ్లపల్లికి రాహుల్, మన్మోహన్ రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా అనంతపురం జిల్లా బండ్లపల్లిలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం పర్యటిస్తారు. ఉదయం పదిన్నర గంటలకు వీరిద్దరూ దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12-30 గంటలకు పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అనంతరం బండ్లపల్లికి చేరుకుని ఉపాధి హామీ పథకం లబ్ధిదారులతో ముఖాముఖిగా మాట్లాడతారు. గ్రామంలో జరిగే బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత సాయంత్రం తిరిగి దిల్లీ వెళతారు. వీరి పర్యటనకు కాంగ్రెస్ నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.