జాతీయ వార్తలు
పారిశ్రామికవేత్తలకే మోదీ కాపలా:రాహుల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 16 November 2018
న్యూఢిల్లీ:ప్రధాని నరేంద్ర మోదీ బడా పారిశ్రామికవేత్తలకు మాత్రమే కాపలాకాస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆయన చత్తిస్గఢ్ సాగర్ జిల్లాలోని దవరి ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ పెద్ద నోట్లు రద్దు అనేది భారీ కుంభకోణమని, పేదలు, నిజాయితీపరులు బ్యాంకుల ముందు పడిగాపులు పడేలా చేశారని అన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం వల్ల అనిల్ అంబానీకి రూ. 30 వేల కోట్ల రూపాయలు సమకూర్చి పెట్టారని అన్నారు.