జాతీయ వార్తలు
మధ్యప్రదేశ్లో వరదలు: 8మంది మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 9 July 2016
భోపాల్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మధ్యప్రదేశ్లో జనజీవనం స్తంభించింది. వరదల తాకిడికి 8 మంది కొట్టుకుపోయారు. మూడు రోజులుగా మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. సత్నా, హోషంగాబాద్, జబల్పూర్, రాయ్సెన్, సాగర్, దామో జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. కరెంటు, నీళ్లు, ఆహారం లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. మరో 24 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.