జాతీయ వార్తలు
డ్రైవర్ లేకుండానే వెళ్లిన రాజధాని ఎక్స్ప్రెస్!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 28 June 2016
మహారాష్ట్ర : ఇంజిన్లో సమస్య కారణంగా ఆగిపోయిన మడగావ్-నిజాముద్దిన్ రాజధాని ఎక్స్ప్రెస్ ఒక్కసారిగా కదిలి- దాదాపు 15 కిలోమీటర్లు డ్రైవర్ లేకుండా ప్రయాణించింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే రైలును నిలిపివేశారు. ఇంజిన్లో సమస్య తలెత్తడంతో రత్నగిరి స్టేషన్ సమీపంలోని ఓ సొరంగ మార్గం వద్ద నిలిపివేశారు. అయితే ఓ వైపు టెక్నీషియన్లు సరిచేస్తుండగానే.. రైలు ఉన్నట్లుండి కదలడం ప్రారంభించింది. ఆ సమయంలో డ్రైవర్ గార్డు క్యాబిన్లో ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ వెంటనే బ్రేకులు వేసి రైలును నిలిపివేయడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు. అనంతరం మరో ఇంజిన్ను ఏర్పాటుచేసి రైలును సమీపంలోని స్టేషన్కు తీసుకెళ్లారు.