తెలంగాణ

చికిత్స పొందుతూ రమ్య తాతయ్య మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పంజాగుట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం మరో వ్యక్తిని బలితీసుకుంది. ఆ ఘటనలో గాయపడి చిన్నారి రమ్య కొద్దిరోజుల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. అదే ఘటనలో తీవ్రంగా గాయపడిన రమ్య తాతయ్య మధుసూదనాచారి 17 రోజులుగా చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆరుగురు మైనర్ యువకులు మద్యం సేవించి వాహనం నడపడడంతో పంజాగుట్ట వద్ద చిన్నారి రమ్య, ఆమె కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జయింది. సంఘటన స్థలంలోనే రమ్య బాబాయి మృతి చెందారు. రోడ్డు ప్రమాదం కారణంగా ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. తమ కుటుంబంలో తీరని విషాదం మిగిలిందని, ప్రమాదానికి కారకులైన ఆరుగురు యువకులను కఠినంగా శిక్షించాలని రమ్య తండ్రి వెంకటరమణ కోరుతున్నారు. తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఇంతవరకూ ఏ విధంగానూ ఆదుకోలేదని ఆయన విలపిస్తున్నారు.