జాతీయ వార్తలు

అత్యాచార కేసులో ఆశారాం దోషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోధ్‌పూర్‌ (రాజస్థాన్‌) : మైనర్‌ బాలికపై అత్యాచార కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూను జోధ్‌పూర్‌ ఎస్సీ, ఎస్టీ ట్రయల్‌ కోర్టు దోషిగా తేల్చింది. బాపుతో పాటు కేసులో నిందితులను కూడా కోర్టు దోషులుగా ప్రకటించింది. అయితే, ఆశారాంకు శిక్షపై కోర్టులో విచారణ ఇంకా కొనసాగుతోంది. కోర్టు తీర్పుపై న్యాయపరంగా సలహా తీసుకుని ముందుకు వెళ్తామని ఆశారాం అధికార ప్రతినిధి చెప్పారు. కాగా, కోర్టు తీర్పు నేపథ్యంలో జోధ్‌పూర్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.