జాతీయ వార్తలు

సామాన్యుల ఆశలు తీరేలా రైల్వే బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దేశ ప్రజల అవసరాలు, సామాన్యుల ఆకాంక్షలు నెరవేరేలా రైల్వే బడ్జెట్‌ను తీర్చిదిద్దామని రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు అన్నారు. ఆయన లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, ప్రయాణీకుల కోసం తాము రూపొందించిన ప్రతిపాదనలు వివరించడం ప్రారంభించారు. రైల్వేశాఖను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. రైల్వేశాఖ ప్రస్తుతం అనేక సమస్యలను, సవాళ్లను ఎదుర్కొంటున్నదని అయినప్పటికీ తాము వెనుకంజ వేసేది లేదన్నారు. కష్టాలను ఎదుర్కొంటూనే ప్రయాణీకులకు నాణ్యమైన సేవలందింస్తామన్నారు. తాను ప్రవేశపెట్టేది సామాన్యుల బడ్జెట్ అని ఆయన అభివర్ణించారు. ప్రభుత్వంతో అన్నివర్గాల వారూ సహకరించినపుడు రైల్వేశాఖ అందరికీ అందుబాటులో ఉంటుందన్నారు.