రంగారెడ్డి

సింగంచెరువు తండాలో 25న ఇళ్ల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాచారం, మార్చి 16: నాచారం డివిజన్ సింగంచెరువు తండాలోని రెండు పడకల గదులను గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు. సుమారు 245 నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా నిర్మించామని మేయర్ పేర్కొన్నారు. అర్హులైన పేదలకు ఈనెల 25న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పంపిణీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, కాప్రా ఇన్‌చార్జి కమిషనర్ యాదగిరిరావు, ఈఈ కోటేశ్వర్ రావు, డీఈ బాలకృష్ణ, నాయకులు శ్రీనివాస్ గౌడ్, భాస్కర్, పీరు నాయక్, రాములు నాయక్ పాల్గొన్నారు.

భారీగా రేషన్ బియ్యం స్వాధీనం
ఘట్‌కేసర్, మార్చి 16: రేషన్ బియ్యం నిల్వచేసి అమ్మకాలు జరుపుతున్న ఓ కిరాణా దుకాణంపై పోలీసులు దాడి జరిపి నిల్వ ఉంచిన బియ్యాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేసినట్లు ఘట్‌కేసర్ పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఘట్‌కేసర్ బ్రూక్‌బాండ్ కాలనీలో ఉన్న సురేష్ కిరాణం దుకాణంలో రేషన్ బియ్యం నిలువ ఉన్నట్లు వచ్చిన సమాచారంపై పోలీసులు శుక్రవారం దాడి జరిపారు. పోలీసుల దాడిలో 10 క్వింటాళ్ల రేషన్ బియ్యం అక్రమంగా నిలువ ఉంచి అమ్మకాలు చేస్తున్నట్లు తేలిందని చెప్పారు. నిందితుడు రేషన్ దుకాణాల నుంచి తక్కువ ధరకు కొనుగోలుచేసి వినియోగదారులకు ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు చెప్పారు. 10 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. రేషన్ బియ్యం ఎక్కడి నుంచి కొనుగోలు చేశాడు, ఎవరు అమ్మారు అనే అంశంపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ రఘువీర్ రెడ్డి తెలిపారు.