తెలంగాణ

ప్రాణహిత భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి
సిద్దిపేట, డిసెంబర్ 5 : ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో నిర్మించే రిజర్వాయర్ భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు అండగా వుంటానని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్, శాసనసభ ఉపనేత రేవంత్‌రెడ్డి హామీనిచ్చారు. ప్రాణహిత-చేవెళ్ల రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా మెదక్ జిల్లా పెద్దకోడూరు, చంద్లాపూర్ గ్రామాల మధ్య నిర్మించే రిజర్వాయర్ భూ నిర్వాసితులు టిడిపి బిసిసెల్ కార్యదర్శి దరిపల్లి చంద్రం, టిఎన్‌ఎస్‌ఎఫ్ జాతీయ సమన్వయ కమిటీ సభ్యులు తాటికొండ రమేశ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలసి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈసందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాణహిత ప్రాజెక్టు భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు రైతులకు అండగా వుండి పోరాటం చేస్తానన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో సైతం ఈ సమస్యను లేవెనెత్తి రైతులకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తానన్నారు. ఈనెల చివరి వారంలో, వచ్చె నెల మొదటి వారంలో సిద్దిపేట, గజ్వేల్ భూ నిర్వాసిత ప్రాంతాల్లో పర్యటించి నిర్వాసితులను కలుపుకొని పెద్దఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఈకార్యక్రమంలో భూనిర్వాసితులు రాజలింగం, బిక్షపతి, రాజవౌళి, పర్షయ్య, మల్లేశం, రాజయ్య పాల్గొన్నారు.