తెలంగాణ
పరిహారం చెల్లిస్తే కెసిఆర్ భూములను ఇచ్చేస్తారా?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 20 June 2016
నల్గొండ: మల్లన్నసాగర్ జలాశయం కోసం నష్టపరిహారం చెల్లించి రైతుల నుంచి భూములను సేకరిస్తున్నట్లు తెరాస సర్కారు చెబుతోందని, ఎకరాకు 25 కోట్లు చెల్లిస్తే కెసిఆర్ తన ఫాంహౌస్ భూములను ప్రజలకు ఇచ్చేస్తారా? అని టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల కోసం తాను 48 గంటల నిరాహార దీక్ష చేస్తానని ఆయన ప్రకటించారు. ఈ రైతులను మంత్రి హరీష్రావు ఇంతవరకూ ఎందుకు కలుసుకోలేదని ఆయన అన్నారు. ప్రాజెక్టుల పేరిట బలవంతంగా భూములను లాక్కుంటే తాము సహించేది లేదన్నారు. పదవులకు రాజీనామా చేయకుండా తెరాసలోకి వెళ్లే నేతలకు సంఘ బహిష్కరణ శిక్ష విధించాలన్నారు.