ఆంధ్రప్రదేశ్
నదుల అనుసంధానంతో ఎపికి మహర్దశ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 19 July 2016
విజయవాడ: గోదావరి,కృష్ణా నదుల అనుసంధానంతో ఎపికి ఇక తిరుగుండదని సిఎం చంద్రబాబు అన్నారు. ఆయన మంగళవారం ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద నదుల సంగమ స్థలంలో పూజలు చేశారు. నదులను అనుసంధానం చేసిన ఘనత దేశం మొత్తమీద మన రాష్ట్రానికే దక్కిందన్నారు. నదులు ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి జరుగుతుందని, అలనాటు కాటన్ దొర కృషి ఫలితంగా ధవళేశ్వరం వద్ద బ్యారేజీని నిర్మించారని, దాంతో ఉభయ గోదావరి జిల్లాలు అభివృద్ధి చెందాయన్నారు. కొంతమంది ఎన్ని విమర్శలు చేసినప్పటికీ, కృష్ణా-గోదావరి జలాల అనుసంధానంతో పట్టిసీమ ప్రాజెక్టును తాను పూర్తిచేయగలిగానని ఆయన వివరించారు. తనను అడ్డుకోవాలని ఎవరైనా ప్రయత్నిస్తే బుల్లెట్లా దూసుకుపోతానన్నారు. త్వరలో పెన్నా నదిలోకి గోదావరి జలాలను పంపిస్తామన్నారు.