జాతీయ వార్తలు

జీపును ఢీకొట్టిన ట్రాక్టర్: 12 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని మోరెనా ప్రాంతంలో గురువారం ప్రయాణికులతో వెళ్తున్న జీపును ఇసుక ట్రాక్టర్‌ వేగంగా ఢీకొట్టడంతో 12 మంది అక్కడికక్కడే మృతిచెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం విషాదకరం. గ్వాలియర్‌కు చెందిన కొందరు తమ బంధువు అంత్యక్రియలకు జీపులో బయల్దేరారు. మార్గమధ్యంలో గంజమపూర్‌ వద్ద మలుపు తిరుగుతుండగా ఎదురుగా వేగంగా వస్తున్న ఇసుక ట్రాక్టర్‌ ఢీకొట్టింది. దీంతో 12 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులు ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు.