రాష్ట్రీయం

రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు : కర్నూలు జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. వెల్దుర్తి మండలం మల్లేపల్లి బస్సు స్టేజి వద్ద వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో కేరళకు చెందిన రూబెన్, అతని భార్య బిస్మాల్, తల్లిదండ్రులు ప్రిషియా, వేదిషియా, అయిదు నెలల కుమారుడు, కారు డ్రైవరు పవన్లు మరణించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు.