తెలంగాణ

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఏడుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా పరిగి బృందం వద్ద బుధవారం ఉదయం ఓ పెళ్లిబృందానికి చెందిన డిసిఎం వ్యాన్ బోల్తాపడిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. వికారాబాద్ మండలం ద్యాచారం నుంచి షాబాద్ మండలం ఉత్తరాస్‌పల్లికి వ్యాన్‌లో సుమారు 60 మంది వెళుతుండగా పరిగి వద్ద ఈ ప్రమాదం జరిగింది. సంఘటన స్థలంలో ఇద్దరు, పరిగి ఆస్పత్రిలో ఇద్దరు, రాజేంద్రనగర్ ఆస్పత్రిలో ముగ్గురు మరణించారు. రాజేంద్రనగర్ ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న 9 మంది క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా, ఈ ఘటనపై తెలంగాణ సిఎం కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆయన వైద్యశాఖ అధికారులను ఆదేశించారు.