దిల్లీలో రోబో
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 11 March 2016
సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘2.0’. ‘రోబో’ సినిమాకు సీక్వెల్గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం దిల్లీలో జరుగుతోంది. అక్కడే మూడు వారాలపాటు షూటింగ్ జరుగుతుందని తెలిసింది. ఈ షెడ్యూల్లో కీలక పాత్రధారులు అందరూ పాల్గొంటారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రజనీకాంత్ కెరీర్లో ‘రోబో’ సినిమా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు భారీ స్థాయిలో దానికి సీక్వెల్ రూపొందిస్తున్నాడు శంకర్. అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతోంది. అమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల చేస్తారని తెలిసింది.