ఆంధ్రప్రదేశ్‌

రోహిత్ కుటుంబానికి రూ.8 లక్షల ఎక్స్‌గ్రేషియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పిహెచ్‌డి విద్యార్థి రోహిత్ కుటుంబానికి 8 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా యాజమాన్యం ప్రకటించింది. సస్పెన్షన్ ఎదుర్కొంటున్న ఐదుగురు విద్యార్థులలో రోహిత్ ఆత్మహత్య చేసుకోగా మిగిలిన నలుగురూ ఇంకా దీక్షలు కొనసాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రోహిత్ ఆత్మహత్య దర్యాప్తు ముమ్మరం చేశారు. మరోవైపు వివిధ రాజకీయ పక్షాలనుంచి రోహిత్ కుటుంబానికి మద్దతు పెరుగుతోంది. విశ్వవిద్యాలయం విసి అప్పారావును సస్పెండ్ చేయాలన్న అంశంతోపాటు పలు డిమాండ్ల పరిష్కారానికి విద్యార్థులు పట్టుపడుతున్నారు. దీక్ష చేస్తున్న విద్యార్థుల ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆందోళన విరమించాలని యూనివర్శిటీ అధికారులు వారిని కోరుతున్నారు.