జాతీయ వార్తలు

రోహిత్ మృతిపై దేశవ్యాప్తంగా నిరసనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ :హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ మృతిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభమయ్యాయి. హెచ్‌సీయూలో ఉద్రిక్తత కొనసాగుతుండగా, ముంబయి యూనివర్శిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అలాగే పూణెలోని ఎఫ్‌టిఐఐ విద్యార్థులు దీక్ష చేస్తున్నారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులు ఆందోళన ప్రారంభించారు. కేంద్ర మంత్రి స్మృతీఇరానీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.